ఓవల్: ఇంగ్లండ్తో రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయదుందుభి మోగించింది. తొలి టెస్టు ఓటమిని మరిపిస్తూ ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ 253 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది.
తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. కివీస్ నిర్దేశించిన 463 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్నైట్ స్కోరు 182-5తో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ (6-29) ధాటికి 209 పరుగులకు కుప్పకూలింది. హెన్రీ పదునైన పేస్ విజృంభణతో కెప్టెన్ జోరూట్(77), బ్రూక్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.