IND Vs NZ | మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలడంతో.. తక్కువ పరుగుల తేడాతో ఓపెనర్లను టీమ్ఇండియా కోల్పోయింది. కీలక మ్యాచ్లో బ్యాట్స్మెన్స్ చేతులెత్తేయడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత జట్టు 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది.
కెప్టెన్ శిఖర్ ధావన్ 28 పరుగులు చేయగా, గిల్ 13, అయ్యర్ 49, పంత్ 10, సూర్యకుమార్ 6, దీపక్ హుడా 12, వాషింగ్టన్ సుందర్ 51, దీపక్ చాహర్ 12, చాహల్ 8, అర్ష్దీప్ 9 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో న్యూజిల్యాండ్ బౌలర్లు సౌథీ 2, ఆడమ్ 3, మిచెల్ 3 వికెట్లు తీశారు.
Innings Break! #TeamIndia post 219 on the board!
5⃣1⃣ for @Sundarwashi5
4⃣9⃣ for @ShreyasIyer15Over to our bowlers now! 👍 👍
Scorecard 👉 https://t.co/NGs0Ho7YOX #NZvIND pic.twitter.com/Nr7vBXKliX
— BCCI (@BCCI) November 30, 2022