దుబాయ్: టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్ లైన్ను పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ దారుణంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. మిస్సైళ్ల లాంటి బంతులతో ఇండియన్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టేశాడు. అయితే రేపు జరగబోయే మ్యాచ్లో షాహీన్ తరహాలో బౌలింగ్ చేస్తానని కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వార్నింగ్ ఇచ్చాడు. టీ20 వరల్డ్కప్లో ఇండియా ఆదివారం తన రెండవ మ్యాచ్ను ఆడనున్నది. నిజానికి పాకిస్థాన్ చేతిలో ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఓటమి పాలయ్యాయి. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ షాహీన్ వేసిన బౌలింగ్ అద్భుతంగా ఉందని, ఇండియా బ్యాటింగ్ లైనప్లో నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారని, అయితే ఆరంభంలో షాహీన్ వికెట్లు తీసిన రీతిలో తాను కూడా బౌలింగ్ చేయనున్నట్లు ట్రెంట్ బౌల్ట్ చెప్పాడు. ఇండియాతో ఆడుతున్న సమయంలో ఆ ఉత్కంఠ వేరుగా ఉంటుందని బౌల్ట్ అన్నాడు. ఇటీవల భారత్పై న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2019 టీ20 వరల్డ్కప్ సెమీస్లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది. ఇటీవల ముగిసిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోనూ ఇండియాను కివీస్ ఓడించింది. రేపటి మ్యాచ్ రెండు జట్లకు కీలకమైందని, మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని బౌల్ట్ తెలిపాడు.