ఆక్లాండ్: తొలి వన్డేలో భారత్ విసిరిన భారీ టార్గెట్ను చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. కివీస్ ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. కాన్వే 24, అలెన్ 22 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం 18 ఓవర్లలో న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 80 రన్స్ చేసింది. విలియమ్సన్ 22, మిచెల్ 10 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో కివీస్ బౌలర్ టిమ్ సౌథీ కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో సౌథీ ఇప్పటి వరకు 202 వికెట్లు తీశాడు. 200 వికెట్ల మైలురాయి దాటిన అయిదో కివీస్ బౌలర్గా సౌథీ రికార్డు క్రియేట్ చేశాడు.
Milestone alert 🚨
Tim Southee has climbed to fourth on the highest wicket-taker list for New Zealand in Men's ODI 👏#NZvIND pic.twitter.com/WKlYdHtU6t
— ICC (@ICC) November 25, 2022