న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 16 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం చెమటోడ్చుతోంది. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతోంది. అయినప్పటికీ.. ఇంకా 4 ఓవర్లలోనే న్యూజిలాండ్ 90 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇండియా 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి.. న్యూజిలాండ్కు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.