సిడ్నీ: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. టీ20 వరల్డ్కప్ ఫస్ట్ సెమీస్లో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో విలియమ్సన్ ఆచితూచి పరుగులు స్కోర్ చేస్తున్నాడు. ఆరంభంలో విలియమ్సన్ ఎటువంటి భారీ షాట్లు ఆడలేదు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ పరుగులు పారించలేకపోయింది. అయితే కేన్, విచెల్ నాలుగో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ ఇద్దరూ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లలో కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 106 రన్స్ చేసింది. కేన్ 43, మిచెల్ 31 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.