T20 World Cup 2024 : ఆట ఏదైనా సరే.. భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. భారత గడ్డపై ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో చిరకాల ప్రత్యర్థుల పోరాటాన్ని కోట్లాది మంది వీక్షించారు. మళ్లీ దాయాదుల సమరాన్ని ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్న్యూస్. పొట్టి ప్రపంచ కప్(T20 World Cup)లో మరోసారి టీమిండియా, పాక్ జట్లు తలపడనున్నాయి.
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో.. న్యూయార్క్ సిటీ(New York City)లోని పాపప్ స్టేడియం వేదికగా భారత్, పాక్ ఢీకొననున్నాయి. 34 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ను వీక్షించనున్నారు. న్యూయార్క్లో ప్రవాస భారతీయుల(NRI)తో పాటు పాక్ దేశీయులు భారీ సంఖ్యలో నివసిస్తారు. దాంతో, ఐసీసీ దాయాదుల పోరును ఈ పట్టణంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుందని టాక్. అయితే.. భారత్, పాక్ మ్యాచ్ వేదికను ఐసీసీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
వచ్చే ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈసారి వరల్డ్ కప్లో ఉగాండా, పపువా న్యూ గినియా వంటి చిన్న జట్లు పోటీ పడుతున్నాయి. నిరుడు విజేతగా నిలిచిన ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఆరంభ ఎడిషన్ 2007లో ట్రోఫీని కొల్లగొట్టిన భారత్ మరోసారి పొట్టి ప్రపంచ కప్ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది.
ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించిన జట్లు : భారత్, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాకిస్తాన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఉగాండా, వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.