MS Dhoni New Role | ఐపీఎల్ -2024లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్ కింగ్స్.. సీజన్ ఆరంభానికి ముందే షాకులివ్వనుందా..? ఆ టీమ్ సారథి, లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి కెప్టెన్సీకి గుడ్ బై చెప్తాడా..? ఈ సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ధోని ఫేస్బుక్ వేదికగా చేసిన పోస్టు ఇదే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎప్పుడో అమవాస్య, పున్నమికి అన్నట్టుగా సోషల్ మీడియాను వాడే మహి.. ఐపీఎల్-17 ఆరంభానికి ముందు ఫేస్బుక్లో ‘న్యూ రోల్’ అని పోస్ట్ పెట్టడంతో చర్చ అంతా మళ్లీ సీఎస్కే సారథ్య మార్పు పైనే జరుగుతోంది.
ఫేస్బుక్లో ధోని స్పందిస్తూ… ‘న్యూ సీజన్లో న్యూ రోల్ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నా. స్టే ట్యూన్డ్’ అంటూ పోస్ట్ పెట్టాడు. పెట్టింది 12 పదాల ఒక వాక్యం కూడా మించని ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ధోని ఈ పోస్ట్ పెట్టిన వెంటనే.. తమిళ తంబీలు ఎవరి ఊహల్లో వాళ్లు విహరిస్తున్నారు. ధోని కొత్త రోల్ అంటే ఓపెనర్గా వస్తాడని కొందరు.. కెప్టెన్సీని అప్పజెప్పుతాడని మరికొందరు వాపోతున్నారు.
Facebook post of MS Dhoni.
– It’s time for the Thala show in IPL 2024. 🦁 pic.twitter.com/vM1HBtrKEa
— Johns. (@CricCrazyJohns) March 4, 2024
ఇవి రెండూ కాదు.. ధోని ఈ సీజన్లో మెంటార్గా ఉండబోతున్నాడని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. నెటిజన్ల కామెంట్స్ ఎలా ఉన్నా ధోని ఏ ఉద్దేశంతో ఆ ‘న్యూ రోల్’ అని పోస్ట్ చేశాడో తెలియాలంటే మార్చి 22 దాకా వేచి చూడాల్సిందే. ఆరోజు సొంతగడ్డపై సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది.
The New ‘Role’ of being an Opener🥶
We’ll be there tbvh💫❤️🔥#MSDhonipic.twitter.com/eG7Mfxs1q3— Hustler (@HustlerCSK) March 4, 2024
It’s an AD @MSDhoni! pic.twitter.com/WDgkIdc1yg
— MSDian™ (@ItzThanesh) March 4, 2024
ఇదిలాఉండగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టి ఫ్యాన్స్ను తికమకకు గురిచేయడం ధోనికి అలవాటే. గతంలో అతడు 2021 టీ20 ప్రపంచకప్కు కొద్దిరోజుల ముందు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినబోతున్నారని ఫేస్బుక్లో ప్రకటించడంతో అందరూ అదేంటబ్బా అని ఆసక్తిగా ఎదురుచూస్తే తీరా అతడు ‘ఓరియో’ బిస్కట్స్ ప్రమోట్ చేశాడు. దీనిపై గతంలో ధోని ట్రోల్స్ కూడా ఎదుర్కున్నాడు. అయితే ధోని తాజాగా షేర్ చేసిన ‘న్యూ రోల్’ పోస్టు ఏదైనా యాడ్కు సంబంధించి ఉంటుందని పలువురు అభిమానులు అనుకుంటున్నారు.
2022 సీజన్లో ధోని.. సరిగ్గా ఆ జట్టు ఆడే తొలి మ్యాచ్కు రెండ్రోజుల ముందు కెప్టెన్సీని వదిలేసి వాటిని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే ఆ సీజన్లో 8 మ్యాచ్లే సారథిగా వ్యవహరించిన జడ్డూ.. రెండు మాత్రమే గెలిచాడు. ఆ తర్వాత సీఎస్కే యాజమాన్యంతో విభేదాలతో సీజన్ నుంచి తప్పుకున్నాడు. 2022 సీజన్లో సీఎస్కే.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. కానీ 2023లో మాత్రం ఆ జట్టు అద్భుతంగా పుంజుకుని ఐదో ట్రోఫీని ఎగురేసుకుపోయింది.