బ్రిస్బేన్: ఒలింపిక్స్ క్రీడల్లో మళ్లీ క్రికెట్కు చోటు ఇవ్వనున్నారు. 128 ఏళ్ల తర్వాత జెంటిల్మెన్ ఆట మళ్లీ ఒలింపిక్స్లో కనిపించనున్నది. 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ క్రీడల్లో క్రికెట్ ఆడనున్నారు. అయితే 2032లో బ్రిస్బేన్లో జరిగే ఒలింపిక్స్లో.. క్రికెట్కు అవకాశం కల్పించే అంశంపై ఇవాళ చర్చ జరిగింది. కొత్తగా నియమితుడైన ఐసీసీ చైర్మెన్ జే షా((Jay Shah) ఆ మీటింగ్లో పాల్గొన్నారు. బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు.
Very exciting time ahead for Cricket’s involvement in the Olympics movement – a meeting with the @Brisbane_2032 organizing committee in Brisbane, Australia today.@ICC | @Olympics | @CricketAus | @BCCI | #brisbane2032 pic.twitter.com/JVyMbkCYrz
— Jay Shah (@JayShah) December 12, 2024
సమ్మర్ క్రీడల్లో ఒలింపిక్స్ను జోడించాలా వద్దా అన్న అంశంపై చర్చించారు. లాస్ ఏంజిల్స్ క్రీడలకు ఓకే చెప్పినా.. బ్రిస్బేన్ క్రీడలకు ఇంకా కన్ఫర్మేషన్ దక్కలేదు. అయితే ఇవాళ బ్రిస్బేన్ అధికారులతో జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను జే షా తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. బ్రిస్బేన్ ఆర్గనైనింగ్ కమిటీ చీఫ్ సిండీ హుక్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హక్లే ఆ మీటింగ్కు హాజరయ్యారు.
శనివారం నుంచి ఆస్ట్రేలియాతో గబ్బా స్టేడియంలో జరిగే మ్యాచ్ను జే షా వీక్షించనున్నారు. ఇక ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కూడా జే షా ప్రకటన చేయాల్సి ఉన్నది. హైబ్రిడ్ మోడల్కు సభ్య దేశాలు అంగీకరించినా.. తుది ప్రకటన ఇంకా వెలుబడలేదు.