India – Pakistan : ప్రపంచ క్రికెట్లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాక్లు మైదానంలో తలపడుతున్నాయంటే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. బంతి బంతికి ప్రేక్షకుల్లో నరాలు తెగేంత ఉత్కంఠ కనిపిస్తోంది. అందుకనే క్రికెట్లోని గొప్ప సమరాల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఒకటిగా పేరొందింది. అయితే.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సరిగ్గా లేని కారణంగా భారత్, పాక్లు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ల్లో మాత్రమే పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్(Netflix) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇండో పాక్ జట్ల మధ్య ఉన్న క్రికెట్ వైరాన్నిడాక్యుమెంటరీగా రూపొందించింది. శుక్రవారం ‘గ్రేటెస్ట్ రైవర్లీ'(Greatest Rivalry) పేరుతో చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. ‘లైట్స్, కెమెరా, క్లీన్ బౌల్డ్. చరిత్రలో భాగమైన, గ్రేటెస్ట్ రైవర్లీ నెట్ఫ్లిక్స్లో త్వరలోనే రాబోతోంది’ అనే క్యాప్షన్తో ఉన్న ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
Lights, Camera, and CLEAN BOWLED!! Witness a bond forged in history- and victory!! 🏏🔥
Greatest Rivalry is coming soon, only on Netflix!#GreatestRivalry #GreatestRivalryOnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/Ezow2j21C2— Netflix India (@NetflixIndia) February 29, 2024
డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్లో భారత లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev), పాక్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్(Imran Khan)లు వరల్డ్ కప్ ట్రోఫీలు పట్టుకొని ఉన్నారు. అయితే.. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనేది మాత్రం నెట్ఫ్లిక్స్ వెల్లడించలేదు. అయితే.. ఈ డాక్యుమెంటరీలో భారత, పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో అభిమానుల్లో కనిపించే టెన్షన్, భావోద్వేగాలు.. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ల మధ్య జరిగే సంభాషణలు చూపించనున్నట్టు సమాచారం.
నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్లు తలపడ్డాయి. అయితే.. ఈ రెండు టోర్నీలోనూ దాయది జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. మళ్లీ టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీ జూన్ 1వ తేదీన షురూ కానుంది. జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది.
ఐసీసీ ట్రోఫీల్లో భారత్, పాకిస్థాన్ తలపడడం ఇది ఎనిమిదో సారి. గత ఏడు పర్యాయాలు దాయాదిపై టీమిండియా పైచేయి సాధించింది. ఇప్పటివరకూ భారత జట్టు ఆరుసార్లు విజేతగా నిలిచింది. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ సేన పాక్ను చిత్తు చేసింది. 2022 పొట్టి ప్రపంచకప్లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో వీరోచిత ఇన్నింగ్స్తో ఆడిన విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో పాక్ను ఓడించాడు.