హైదరాబాద్ : సికింద్రాబాద్ను (లష్కర్) జిల్లాగా( Lashkar district) ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ను(Minister Ponnam Prabhakar ) జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకత గురించి మంత్రికి వారు విన్నవించారు.
కాగా, జిల్లా ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బాల రాజ్ యాదవ్, ఉపాధ్యక్షుడు శైలేందర్, శ్రీకాంత్ రెడ్డి, రవీందర్ సాగర్, సునీల్ తదితరులు ఉన్నారు.