Bangladesh : సొంతగడ్డపై శ్రీలంకతో జరుగబోయే టీ 20 సిరీస్లో బంగ్లాదేశ్(Bangladesh) క్రికెటర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. సీనియర్ జట్టుతో పాటు జనియర్ జట్టు ఆటగాళ్లు కూడా కొత్త జెర్సీలో తళుక్కుమననున్నారు. అవును.. శుక్రవారం ఆ దేశ క్రికెట్ బోర్డు ఢాకాలో కొత్త జెర్సీలను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పురుషుల జట్టు సారథి నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto), ఆల్రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్లు పాల్గొన్నారు. కొత్త జెర్సీలు ధరించి స్టేజ్మీద సందడి చేశారు.
మహిళల జట్టు వైస్ కెప్టెన్ నహిదా అక్తర్, పేసర్ మరుఫా అక్తర్, అండర్ -19 కెప్టెన్లు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ, రబెయా ఖాన్లు కూడా కొత్త జెర్సీలు ధరించి ఫొటోలకు పోజిచ్చారు. కన్నుల పండువగా సాగిన ఈ ఈవెంట్లో టైటిల్ స్పాన్సర్ పేరును కూడా బంగ్లా క్రికెట్ బోర్డు వెల్లడించింది. పాపులర్ మొబైల్ నెట్వర్క్ కంపెనీ రొబి టైటిల్ స్పాన్సర్గా వ్యహరించనుందని బీసీబీ పెద్దలు తెలిపారు.
In a momentous event, the Bangladesh National Cricket Team unveiled their vibrant new jerseys in a grand launch ceremony, joined by Robi, the esteemed Sponsor of the Bangladesh National Cricket Team. 🇧🇩🏏#BCB | #Cricket | #Robi | #BangladeshCricketTeam | #JerseyUnveiling pic.twitter.com/WjQlt5nfCn
— Bangladesh Cricket (@BCBtigers) February 29, 2024
‘రోబి మళ్లీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ఆడబోతున్నాం. రోబి సహకారంతో జాతీయ జట్టు మరిన్ని అద్భుతాలు చేయనుంది’ అని బీసీబీ డైరెక్టర్ అక్రమ్ ఖాన్ తెలిపాడు. శ్రీలంక జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ చేరుకుంది. ఇరు జట్ల మధ్య మార్చి 4వ తేదీన తొలి టీ20 జరుగనుంది.