న్యూఢిల్లీ : ఒలింపిక్ జావెలిన్ చాంపియన్ నీరజ్ చోప్రా మే 5న దోహాలో జరుగనున్న డైమండ్ లీగ్తో సీజన్ను ప్రారంభించనున్నాడు. గత యేడాది గాయం కారణంగా దోహా లీగ్లో పాల్గొనలేకపోయిన నీరజ్ ప్రపంచ మేటి అథ్లెట్లు ఆండర్సన్ పీటర్స్(గ్రెనెడా), జాకబ్ వాడ్లెచ్(చెక్ రిపబ్లిక్), జులియన్ వెబర్(జర్మనీ), కెషోర్న్ వాల్కాట్(ట్రినిడాడ్-టుబాగొ), జులియస్ ఎగొ(కెన్యా)తో పోటీపడనున్నాడు.
వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు 89.94మీ. సాధించిన నీరజ్ ఈ యేడాది 90 మీటర్లను అధిగమించాలని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం నీరజ్ టర్కీలో శిక్షణ పొందుతున్నాడు. మే 5న దోహా డైమండ్ లీగ్తో ఆరంభమయ్యే ఈ సీజన్ సెప్టెంబర్ 16-17 తేదీలలో అమెరికాలోని యుజెన్లో జరిగే లీగ్తో ముగుస్తుంది.