న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. స్విట్జర్లాండ్లోని సుసానెలో జరిగిన డైమండ్ లీగ్ అథ్లెటిక్స్లో స్వర్ణం పతకం సాధించాడు. దీంతో డైమండ్ లీగ్లో టైటిల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా ఘనత సాధించాడు.
లుసానే లీగ్లో మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచిన 24 ఏండ్ల నీరజ్.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేసి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరుగనున్న జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్కు కూడా అర్హత సాధించినట్లయింది. అదేవిధంగా వచ్చేఏడాది బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ బెర్తు ఖరారు చేసుకున్నాడు.
NEERAJ IS BACK WITH A BANG!! 💥@Neeraj_chopra1 becomes 1st Indian to win a #DiamondLeague Meet & claim the top spot at #LausanneDL with the best throw of 89.08m
That's our Star Neeraj for you!!
Well done 👏📸 @matthewquine
1/1 pic.twitter.com/C7PTWs1EIg— SAI Media (@Media_SAI) August 26, 2022