Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఫిట్నెస్ సాధించాడు. డైమండ్ లీగ్(Diamond League) ఆరో దశ పోటీల్లో సత్తా చాటేందుకు ఈ వరల్డ్ నంబర్ 1 అథ్లెట్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని డైమండ్ లీగ్ పోటీ నిర్వాహకులు ధ్రువీకరించారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న జావెలిన్ త్రోయర్స్ జాబితాలో నీరజ్ చోప్రా పేరు కూడా ఉంది. ‘డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు.
చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వద్లెచ్(Jakub Vadlejch), జర్మనీ జావెలిన్ త్రోయర్ జులియన్ వెబర్(Julian Weber)తో అతను పోటీ పడనున్నాడు’ అని నిర్వాహకులు తెలిపారు. లాసాన్నేలో జూన్ 30వ తేదీన డైమండ్ లీగ్ ఆరో దశ పోటీలు మొదలవ్వనున్నాయి. మరోవైపు ఇదే లీగ్లో భారత స్టార్ అథ్లెట్లు జశ్విస్ అల్డ్రిన్, శ్రీశంకర్లు లాంగ్జంప్లో పోటీ పడనున్నారు.
జావెలిన్ త్రోలో సంచలనంగా మారిన నీరజ్ చోప్రాకు భుజానికి గాయం అయింది. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఫిట్గా లేకపోవడంతో నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం చోప్రాం పూర్తిగా కోలుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి అతడి హవా మొదలైంది. మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో నీరజ్ జావెలిన్ను 88.67 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను జావెలిన్ త్రో ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు.