టోక్యో ఒలిపింక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ ఫిట్నెస్ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. నీరజ్ చోప్రాను బాహుబలితో పోలుస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే చోప్రా ఫిట్నెస్కు అతని బామ్మే కారణమట. నీరజ్ కు పదేండ్ల వయసులో ఉన్నప్పుడే మంచి పౌష్టికాహారాన్ని అందించేదట. ప్రతి రోజు రొట్టె, నెయ్యి, చక్కెరతో కలిపి ఇచ్చేదట. కుర్మా, చపాతీని కూడా బాగా తినిపించేందట. దీంతో నీరజ్ 11 ఏండ్ల వయసులోనే 80 కేజీల బరువు పెరిగాడు. లావుగా, తెల్లగా, ముద్దుగా ఉండేవాడట నీరజ్. ఇక భారీగా శరీరం పెరగడంతో.. ప్రతి రోజు పానిపట్ స్టేడియం(హర్యానా) వెళ్లి కఠోర సాధన చేసేవాడట. అలా బరువు తగ్గినప్పటికీ.. ఫిట్నెస్ మీద అప్పట్నుంచే దృష్టి పెట్టాడట నీరజ్.
నేడు టోక్యో ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించడానికి నీరజ్ అంకుల్ కారణమని చెప్పొచ్చు. నీరజ్ తన చిన్న వయసులోనే అథ్లెటిక్స్ మీద ఆసక్తి కనబరచడాన్ని అతని అంకుల్ కనిపెట్టాడు. దీంతో జావెలిన్ త్రోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. అలా జావెలిన్ త్రోలో అనేక విజయాలు సాధించి.. నేడు టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించాడు.