టోక్యో ఒలింపిక్స్లో ప్రపంచ దిగ్గజాలను వెనక్కు నెట్టి జావెలిన్ త్రోలో పసిడి పతకం అందుకున్న నీరజ్ చోప్రా.. మరోసారి సత్తా చాటాడు. ఫిన్ల్యాండ్ వేదికగా జరిగిన క్వార్టేన్ గేమ్స్లో కూడా బంగారు పతకం సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 86.69 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన నీరజ్.. దేశానికి మరోసారి గర్వకారణం అయ్యాడు. వర్షం పడి తడి తడిగా ఉన్న వాతావరణంలో అతను ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఈ క్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్.. నీరజ్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘‘నీరజ్కు పసిడి.. అతను మరోసారి సాధించాడు. అద్భుతమైన ఛాంపియన్. తొలి అటెంప్ట్లోనే 86.69 మీటర్లతో క్వార్టేన్ గేమ్స్-2022లొ పసిడి పతకం సాధించడం. ఈ సీజన్తో తొలి పతకం సాధించిన నీరజ్కు అభినందనలు’’ అంటూ అనురాగ్ ఠాకూర్ మెచ్చుకున్నాడు.