Naveen Ul Haq : వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలికిన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq).. ఇకపై టీ20ల్లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Gaints)కు ప్రాతినిధ్యం వహించిన అతడు ఆట కంటే వివాదాలతో వార్తల్లో నిలిచాడు. అయినా సరే 17వ సీజన్కు లక్నో రీటైన్ చేసుకుంది.
అయితే.. 16వ సీజన్లో నవీన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), నవీన్ మైదానంలోనే గొడవపడడం అప్పట్లో మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఈ అఫ్గన్ స్పీడ్స్టర్ ఇన్స్టాగ్రామ్లో ‘స్వీట్ మ్యాంగోస్'(Sweet Mangoes) ఫొటోతో కోహ్లీ అభిమానులు ఆగ్రహానికి గురయ్యాడు. 17వ సీజన్ వేలానికి సమయం దగ్గర పడిన నేపథ్యంలో నవీన్ స్వీట్ మ్యాంగోస్ వివాదంపై పెదవి విప్పాడు. ‘మేము గోవా వెళ్లడానికి ముందు నాకు తియ్యని మామిడి పండ్లు తినాలని ఉందని ధావల్ భాయ్(లక్నో టీమ్)కు చెప్పాను. అతడు అదే రోజు రాత్రి నాకోసం మ్యాంగోస్ తెచ్చాడు. దాంతో, నేను టీవీ ముందు కూర్చొని మామిడి పండ్లు తింటున్నా. ఆ సమయంలో స్క్రీన్ మీద కోహ్లీ ఫొటో లేదు. ముంబై ఇండియన్స్ బౌలర్ కనిపిస్తున్నాడంతే.
Who said “sweet mangoes”? 🫣😂
Full interview on YouTube! 💙#LucknowSuperGiants | #LSG | #DurbansSuperGiants | #DSG | pic.twitter.com/SKGzZv4HQ2
— Lucknow Super Giants (@LucknowIPL) December 2, 2023
అందుకని నేను స్వీట్ మ్యాంగోస్ అని పోస్ట్ పెట్టాను. కానీ, అందరూ దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు. నేను ఏమీ మాట్లాడకుండానే ఏదోదో ఊహించుకున్నారు. అందుకని నేను మౌనంగా ఉన్నా. అది మామిడి పండ్ల సీజన్.. దుకాణదారులు వాటిని పోస్ట్ చేస్తారని అనుకున్నాను’ అని నవీన్ ఉల్ హక్ వివరణ ఇచ్చాడు.
నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ
ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచులో ఆర్సీబీ, లక్నో తలపడిన సమయంలో కోహ్లీ, నవీన్ మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు కోహ్లీ తన పాదాల్ని చూపిస్తూ అతడిని హెచ్చరించాడు. ఆ మ్యాచ్ తర్వాత హేక్హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీ, నవీన్తో ఏదో మాట్లాడాలని చూశాడు. అప్పుడు లక్నో మెంటర్ గౌతం గంభీర్ కలగచేసుకోవడంతో ఆ వివాదం మరింత ముదిరింది. అయితే.. రెండోసారి లక్నో, ఆర్సీబీ ఎదరుపడినప్పుడు కోహ్లీ, నవీన్ నవ్వుతూ పలకరించుకున్నారు. ఇద్దరూ హుందాగా నడుచుకొని మైదానంలో మొదలైన గొడవకు మైదానంలోనే తెరదించారు.