లక్నో: ఉత్తరప్రదేశ్లో మతమార్పిడి(Religious Conversion) ఘటనలో 42 మందిపై కేసు బుక్ చేశారు. దాంట్లో 9 మందిని అరెస్టు చేశారు. పేద, గిరిజన ప్రజల్ని క్రైస్తవంలోకి మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూపీలోని సోన్భద్ర జిల్లాలో ఈ ఘటన జరిగింది. మతపరమైన గ్రంధాలు, ప్రచార వస్తువులు, ల్యాప్టాప్లును అరెస్టు చేసిన వారి నుంచి రికవరీ చేశారు. జిల్లాలోని చొప్పన్ పోలీసు స్టేషన్లో మతమార్పిడిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు పద్ధతిలో క్రైస్తవ మతంలోకి మార్పుడులు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మతమార్పిడులను నిషేధిస్తూ ఇటీవల యూపీ సర్కారు ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెన్నైకి చెందిన జైప్రభు, యూపీలోని రాబర్ట్గంజ్కు చెందిన అజయ్ కుమార్, ఏపీలోని విజయవాడకు చెందిన చెక్క ఎమ్మాన్యువల్ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన మిగితావారిలో రాజేంద్ర కోల్, చొటు అలియాస్ రంజన్, పరమానంద్, సోహన్, ప్రేమ్నాథ్ ప్రజాపతి, రామ్ ప్రతాప్లు ఉన్నారు.