హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత స్విమ్మింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న ర్యాంకింగ్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కానుంది. గచ్చిబౌలిలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్ను.. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 29 రాష్ర్టాలకు చెందిన స్విమ్మర్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, కొండ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.