దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మే నెలకు గాను ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్కు ఈ అవార్డు దక్కగా.. వుమెన్స్ క్రికెట్లో స్కాట్లాండ్ ఆల్రౌండర్ కాథరిన్ బ్రైస్కు అవార్డు దక్కింది. ముష్ఫికర్ రహీమ్ ఈ మధ్య సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు సాధించాడు.
మూడు మ్యాచ్లు కలిపి రహీమ్ 237 పరుగులు చేశాడు. రెండో వన్డేలో సెంచరీ కూడా ఉంది. దీంతో తొలిసారి శ్రీలంకపై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది. 15 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తర్వాత కూడా ముష్ఫికర్ రహీమ్ పరుగుల దాహం తీరలేదని ఈ సందర్భంగా ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యుడైన వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.