Ranji Trophy : భారత క్రికెట్లో ముంబైకి చెందిన ఖాన్ బ్రదర్స్ అదరగొడుతున్నారు. అరంగేట్రం టెస్టు మ్యాచ్లోనే సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) హాఫ్ సెంచరీలతో కదం తొక్కగా.. అతడి సోదరుడు ముషీర్ ఖాన్ (Musheer Khan) రంజీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్లో వరుస సెంచరీలతో కదం తొక్కిన ముషీర్ రంజీ (Ranji Trophy)ల్లో తొలి డబుల్ సెంచరీ బాదేశాడు.
బరోడాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ముషీర్ 203 రన్స్ కొట్టాడు. 357 బంతుల్లో 18 ఫోర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో, ముంబై భారీ స్కోర్ చేయడం ఖాయమనిపించింది. కానీ, బరోడా బౌలర్ భార్గవ్ భాట్ విజృంభణతో ముంబై జట్టు 384 పరుగులకే ఆలౌటయ్యింది. భార్గవ్ ఏడు వికెట్లతో ముంబై జట్టును దెబ్బకొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన బరోడా రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు కొట్టింది.
Double Delight ✌️
2⃣0⃣3⃣* runs
3⃣5⃣7⃣ balls
1⃣8⃣ foursMusheer Khan played a brilliant knock of 203* (357) to help Mumbai post 384 in the 1st innings against Baroda in #QF2 at the BKC Ground in Mumbai.@IDFCFIRSTBank | #MUMvBDA | #RanjiTrophy
Relive 📽️ his fantastic knock 🔽 pic.twitter.com/2ZRKMuI6xh
— BCCI Domestic (@BCCIdomestic) February 24, 2024
మరో మ్యాచ్లో అథర్వ తైడే(109) సెంచరీ, కరుణ్ నాయర్ 90 హాఫ్ సెంచరీ బాదడంతో విదర్భ 460 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కర్నాటక ఆట ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు కొట్టింది. సౌరాష్ట్రతో జరుగుతున్న క్వార్టర్స్లో తమిళనాడు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంద్రజిత్(80), కుమార్(65)లు హాఫ్ సెంచరీలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు.