IPL 2024: రెండు సీజన్ల తర్వాత హార్ధిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి చేర్చుకోబోతున్న ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లను వేలానికి వదిలేస్తుంది. గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా ముంబైలోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే అతడిని దక్కించుకోవాలంటే ముంబైకి రూ. 15 కోట్లు కావాల్సి ఉంది. పాండ్యాను దక్కించుకోవాలంటే ముంబై వద్ద ఇప్పటికే అట్టిపెట్టుకుని ఉన్న పలువురు ఆటగాళ్లను వదులుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ముంబై.. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ తో పాటు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లనూ వదిలేయనున్నట్టు సమాచారం.
కామెరూన్ గ్రీన్ను గత వేలంలో ముంబై ఏకంగా రూ. 17.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. గాయంతో ఆడడని తెలిసినా జోఫ్రా ఆర్చర్ను ఏకంగా రూ. 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గత సీజన్లో గ్రీన్ ఫర్వాలేదనిపించినా ఆర్చర్ ఆడిన నాలుగైదు మ్యాచ్లలో పెద్దగా రాణించలేదు. ఈ సీజన్లో కూడా అతడు ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలో ఆర్చర్ను వదిలించుకోవడమే బెటర్ అన్న అభిప్రాయంలో ముంబై ఉంది. మరోవైపు గ్రీన్కు బదులు హార్ధిక్ ఆల్ రౌండర్ బాధ్యతలు పోషించే అవకాశం ఉండటంతో అతడిని కూడా వదిలేసేందుకు సిద్ధమైందని సమాచారం.
There are talks that Mumbai Indians might consider releasing Cameron Green and Jofra Archer to generate extra funds of 5 Crores. (Cricbuzz) pic.twitter.com/88HYKKKK0Y
— CricketMAN2 (@ImTanujSingh) November 25, 2023
ఈ ఇద్దరినీ వదిలించుకుంటే ముంబైకి రూ. 25.5 కోట్లు మిగులుతాయి. అందులో హార్ధిక్కు రూ. 15 కోట్లు పోగా మరో పది కోట్ల రూపాయలుంటాయి. అదీగాక ఈ ఏడాది బీసీసీఐ.. ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను మరో రూ. 5 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. అంటే హార్ధిక్ ను తీసుకున్నా ముంబై వద్ద మరో రూ. 15 కోట్లు మిగులుతాయి. ఒకవేళ వేలంలో మరెవరినైనా వదిలేసినా తద్వారా మిగిలే నిధుల ద్వారా యాక్షన్లో సమర్థవంతమైన ఆటగాళ్లను దక్కించుకునే ఛాన్స్ ఉంది.
Mumbai Indians might consider releasing Cameron Green & Jofra Archer to generate extra funds of INR 5 Crore. [Cricbuzz] pic.twitter.com/yi2u7kOvEa
— Johns. (@CricCrazyJohns) November 25, 2023