ముంబై: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇది 69వ లీగ్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కాగా, ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్ బెర్త్ను కన్ఫామ్ చేసుకునే అవకాశం ఉంది.
ఇవాళ జరిగే మరో లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఆ మ్యాచ్ కూడా ఆర్సీబీకి చాలా కీలకం. ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశం ఉంటుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ రెండు జట్లు విజయాలు సాధిస్తే రన్రేట్ ఆధారంగా ప్లే ఆఫ్కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు. అదేవిధంగా ఈ రెండు జట్లు ఓడిపోతే కూడా నెట్ రన్ రేటే ప్లే ఆఫ్ వెళ్లే జట్టును నిర్ణయిస్తుంది.
ముంబయి ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, ఎన్ వధేరా, కేకే సింగ్, ఏ మాధ్వల్, పీయూష్ చావ్లా, జే బ్రెండ్హాఫ్, జోర్డాన్.
సన్రైజర్స్ జట్టు : ఎం అగర్వాల్, వీ శర్మ, ఏ మాక్రమ్ (కెప్టెన్), హెచ్ బ్రూక్, జీ ఫిలిప్స్, హెచ్ క్లాసెన్ (వికెట్ కీపర్ ), ఎస్ సింగ్, భువనేశ్వర్కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంగ్ దగర్, నితీశ్కుమార్రెడ్డి.