Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ముందే క్రికెట్ దిగ్గజాలంతా ఒక్క చోట చేరుతున్నారు. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంజైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారిడి ప్రీ -వెడ్డింగ్(Pre-Wedding) వేడుకకు మాజీ ఆటగాళ్లంతా తరలివెళ్తున్నారు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)లు కుటుంబంతో కలిసి అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక(Radhika)ల ముందస్తు పెండ్లితంతులో పాల్గొనేందుకు వెళ్లారు.
శుక్రవారం ముంబై విమానాశ్రయంలో మహీ, సచిన్లు కుటుంబ సమేతంగా కెమెరా కంట పడ్డారు. మాజీ పేసర్ జహీర్ ఖాన్, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యాలు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. గుజరాత్లోని జామ్ నగర్లో అనంత్, రాధికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న మొదలవ్వనున్నాయి.
జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్, పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్
అంబానీ కుటుంబానికి క్రికెట్తో విడదీయలేని బంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ముంబై ఇండియన్స్ జట్టు వాళ్లదే. ముఖేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ, కొడుకు అనంత్ అంబానీలు క్రికెట్ వ్యవహారాలు చూసుకునేవాళ్లు.
ఐపీఎల్ ట్రోఫీతో రోహిత్ శర్మ
రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై ఏకంగా ఐదు సార్లు చాంపియన్గా నిలిచింది. అంతేకాదు మహిళల ప్రీమియర్ లీగ్లోనూ ముంబై జట్టు నిరుడు చాంపియన్గా అవతరించింది. ఇంటర్నేషన్లో టీ20 లీగ్లో నికోలస్ పూరన్ సారథ్యంలోని ఎంఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది.