MS Dhoni : ఐపీఎల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. మహీ భాయ్ ఎక్కడ ఆడినా.. స్టేడియమంతా ‘ధోనీ.. ధోనీ’ నినాదాలతో మార్మోగిపోవాల్సిందే. టీమిండియా రోజుల నుంచి అభిమానుల మనసు గెలిచిన ధోనీ.. ఐపీఎల్తో ఫాలోవర్స్ సంఖ్యను అమాంతం పెంచుకున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్నాహక క్యాంప్లో ఉన్నమిస్టర్ కూల్ కెప్టెన్కు ఒక అభిమాని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. విష్ణువు అవతారమైన ‘నాయణుడి విగ్రహా’న్ని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
A fan gifted “Lord Narayana” Idol to MS Dhoni. ⭐ pic.twitter.com/q9PcP5cVHt
— Johns. (@CricCrazyJohns) March 10, 2024
టీమిండియా సారథిగా మూడు ఐసీసీ ట్రోఫీలు కట్టబెట్టిన ధోనీ.. ఐపీఎల్లోనూ తన మార్క్ చూపించాడు. నిరుడు చెన్నైకి ఐదో టైటిల్ అందించిన ధోనీ కెరీర్లో చివరి సీజన్కు సిద్ధమవుతున్నాడు. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికల ప్రీ-వెడ్డింగ్ కార్యకమ్రం అనంతరం ధోనీ సీస్కే ట్రైనింగ్ క్యాంప్లో చేరాడు.
Let’s fill the comments section with ________ 🔥#WhistlePodu 🦁💛 @msdhoni pic.twitter.com/Kw2pvbdTjG
— Chennai Super Kings (@ChennaiIPL) March 9, 2024
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్తో సహచరుల్లో ఉత్సాహం నింపాడు. మార్చి 22 నుంచి 17వ సీజన్ ఆరంభం కానుంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి.