MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) క్రిస్మస్ సంబురాల్లో సదండి చేశాడు. దుబాయ్లో సోమవారం భార్య సాక్షి సింగ్(Sakshi Singh), కూతురు జీవా, టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), స్నేహితులతో కలిసి మహీ భాయ్ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీ, పంత్, సాక్షి శాంతాక్లాజ్ టోపీలు పెట్టుకొని క్రిస్మస్ ట్రీ ముందు ఫొటోలు దిగారు.
ఈ ఫొటోలను ‘మెర్రీ క్రిస్మస్’ అనే క్యాప్షన్తో సాక్షి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత క్రికెట్ జట్టుకు ఆడినప్పటి నుంచి ధోనీ, పంత్ బ్రదర్స్లా ఉంటున్నారు. ధోనీ ఇంట ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, బర్త్ డే పార్టీ అయినా పంత్ అక్కడ వాలిపోతున్నాడు.
ధోనీ వారసుడిగా కీపింగ్ గ్లోవ్స్ అందుకున్న పంత్ అనతికాలంలోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో ఈ విధ్వంసక వికెట్ కీపర్ బ్యాటింగ్తో హడలెత్తించాడు. అయితే.. నిరుడు డిసెంబర్ 31న ఊహించనివిధంగా కారు యాక్సిడెంట్కు గురయ్యాడు. అనంతరం మోకాలి సర్జరీ కారణంగా జాతీయ జట్టుకు, ఐపీఎల్ 16వ సీజన్కు దూరమైన పంత్..
ధోనీ, రిషభ్ పంత్
ఈసారి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) సారథిగా బరిలోకి దిగుతున్నాడు. ఈ మధ్యే దుబాయ్ వేదికగా డిసెంబర్ 19వ తేదీన జరిగిన మినీ వేలంలో ఈ డాషింగ్ బ్యాటర్ పాల్గొన్న విషయం తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు ఐదో టైటిల్ అందించిన ధోనీ.. 17వ సీజన్కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సీజన్తో ఈ దిగ్గజ కెప్టెన్ తన ఐపీఎల్ కెరీర్కు వీడ్కోలు పలికే చాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.