ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో జడేజా వరుసగా 6, 6, 6( నోబాల్), 6, 2, 6, 4 బాదడంతో నోబాల్తో కలిపి ఏకంగా 37 పరుగులు రాబట్టాడు.
ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్ రికార్డును జడ్డూ సమం చేశాడు. 2011లో కొచి టస్కర్స్ కేరళతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరఫున ఆడిన గేల్ ఒకే ఓవర్లో (6, 6+నోబాల్, 4, 4, 6, 6, 4) 36 పరుగులు (నోబాల్ కలిపితే 37) సాధించాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(37 రన్స్) సమర్పించుకున్న రికార్డును హర్షల్ సమం చేశాడు. ఐపీఎల్లో ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా జడేజా సమం చేశాడు.
క్రిస్గేల్- 37 vs పరమేశ్వరన్(కోచి)-2011
జడేజా-37 vs హర్షల్ పటేల్(బెంగళూరు)-2021
సురేశ్ రైనా-33 vs పర్విందర్ అవానా(పంజాబ్ కింగ్స్)-2014