Mohit Sharma : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుత విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు రవీంద్ర జడేజా(15 నాటౌట్) సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. పరుగెత్తుతూ వెళ్లి డగౌట్లో ఉన్న కెప్టెన్ ఎంఎస్ ధోనీని కౌగిలించుకున్నాడు. ధోనీ అతడిని అమాంతం ఎత్తుకుని అభినందించాడు. అయితే.. 20వ ఓవర్ వేసిన గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మోహిత్ శర్మ(Mohit Sharma) మాత్రం ఆ రోజును అంత తొందరగా మర్చిపోయేలా లేడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.
‘ఫైనల్ మ్యాచ్ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాలుగు బంతులు యార్కర్లు వేసిన నేను ఆఖరి రెండు బంతులు ఎందుకు వేరేగా వేశాను అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. ఈ సీజన్ ఆసాంతం నేను అద్భుతంగా బౌలింగ్ చేశా. అదే కాన్ఫిడెన్స్తో ఆఖరి ఓవర్లో నాలుగు యార్కర్లు వేశాను. ఆ తర్వాత బంతి కూడా యార్కర్ వేద్దామనుకున్నా. కానీ, మిస్ అయింది. జడేజా దాన్ని సిక్సర్గా మలిచాడు’ అని మోహిత్ తెలిపాడు.
𝙒𝙚 𝙬𝙖𝙣𝙩 𝙩𝙤 𝙙𝙚𝙙𝙞𝙘𝙖𝙩𝙚 𝙩𝙝𝙞𝙨 𝙏𝙞𝙩𝙡𝙚 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 𝙩𝙤 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 💛
Men of the moment @imjadeja & @IamShivamDube recap #CSK‘s glorious win in the #TATAIPL 2023 #Final 👌🏻👌🏻 – By @ameyatilak
Full Interview 🎥🔽 #CSKvGT https://t.co/kDgECPSeso pic.twitter.com/yp09HKKCSn
— IndianPremierLeague (@IPL) May 30, 2023
క్వాలిఫైయర్ 2లో ముంబైపై 5 వికెట్లు తీసిన మోహిత్ శర్మ ఆఖరి ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు. దాంతో, చెన్నై విజయం అసాధ్యమే అనుకున్నారంతా. అయితే.. మోహిత్ శర్మతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. దాంతో చక్కగా బౌలింగ్ చేస్తున్న అతడిని అనవసరంగా పాండ్యా డిస్టర్బ్ చేశాడని మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్ విమర్శించారు. తొలి నాలుగు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత పాండ్యా వచ్చి మోహిత్కు ఏదో చెప్పాడు. ఆ తర్వాత బంతిని జడ్డూ స్టాండ్స్లోకి పంపాడు. ఆఖరి బాల్కు ఫైన్ లెగ్లో బౌండరీ బాదాడు. దాంతో, చెన్నై ఐదోసారి ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. ఐదు ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 233 రన్స్ కొట్టింది. యంగ్స్టర్ సాయి శ్రీనివాస్(96) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. దాంతో, చెన్నైకి 171 పరుగుల లక్ష్యాన్ని విధించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే(47), రుతురాజ్ గైక్వాడ్(26) దంచారు. ఆ తర్వాత వచ్చిన రహానే(27), శివం దూబే(32 నాటౌట్), అంబటి రాయుడు(19) తలా ఒక చేయి వేశారు.