MS Dhoni | చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గురువారం మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో మహీ మోకాలి సమస్య బాధపడ్డ విషయం తెలిసిందే. కప్ను గెలిచిన 48 గంటల్లోనే ముంబయిలోని ఆసుపత్రికి వెళ్లాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్కు పంత్కు చికిత్స అందించిన వైద్యుడిని సంప్రదించగా.. ఆపరేషన్ అవసరమని చెప్పారు. దాంతో ధోని మోకాలికి చికిత్స కోసం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చేరుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆపరేషన్ చేయగా.. విజయవంతమైంది.
ధోనికి వైద్యుడు దిన్షా పార్దివాలా చికిత్స ఆపరేషన్ చేశారు. ఆయన స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్లో నిపుణుడు
కాగా.. ఆసుపత్రిలో స్పోర్ట్స్ మెడిసిన్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. పంత్కు సైతం ఆయనే చికిత్స అందిస్తున్నారు. 2019లో ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రాకు సైతం ఆపరేషన్ చేశారు. ఇదిలా ఉండగా.. ముంబయికి వెళ్లే ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మేనేజ్మెంట్ను ధోని సంప్రదించాడు. మేనేజ్మెంట్ ఫిజీషియన్ డాక్టర్ మధును ధోనీ వెంట ముంబయికి పంపింది.
అయితే, ధోని గాయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ బుధవారం ప్రకటన చేశారు. ఐపీఎల్ సమయంలో ఎడమ మోకాలి గాయంతో ధోనీ ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యేకంగా బ్యాండేజీ కట్టుకుని బరిలోకి దిగేవాడు. ఐపీఎల్ ధోని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగడానికి సైతం కారణం ఇదేనని తెలిపారు. గాయంపై వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాడని చెప్పారు. అయితే, వచ్చే సీజన్లో ధోని ఆడతాడా? లేడా? అన్నదానిపై స్పందిస్తూ.. నిజాయితీగా చెప్పాలంటే తాము ఇంకా దశకు చేరుకోలేదని, ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. అది పూర్తిగా ధోని నిర్ణయమేనన్నారు.