న్యూఢిల్లీ: కన్నతండ్రి చనిపోయి బాధలో ఉన్న సమయంలో టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి తనకు అండగా నిలిచాడని హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. సిరాజ్ ఆసీస్ పర్యటనలో ఉన్న సమయంలో తండ్రి మృతిచెందగా.. రెండో టెస్టులో చోటు దక్కించుకున్న హైదరాబాదీ 5 వికెట్లతో సత్తాచాటాడు. “నువ్వు టెస్టు ఆడు. ఐదు వికెట్లు దక్కుతాయి. మీ నాన్న ఆశీస్సులు నీవెంట ఉంటాయి’ అని రవి సార్ మ్యాచ్కు ముందే చెప్పారు. ఆట ముగిశాక ఆయన మాటలే నిజమయ్యాయి. కష్టకాలంలో కెప్టెన్ కోహ్లీ భాయ్, రవి సార్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సార్ తోడ్పాటు మరువలేనిది’ అని సిరాజ్ గురువారం చెప్పాడు. ఆసీస్ టూర్లో 13 వికెట్లు పడగొట్టిన హైదరాబాదీ పేసర్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్లోనూ సత్తాచాటాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్ సిరీస్ కోసం సిరాజ్ సిద్ధమవుతున్నాడు.