దుబాయ్: ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ జరిమానా ఎదుర్కున్నాడు. అడిలైడ్ టెస్టులో భాగంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత ఆ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.
దీంతో ఐసీసీ.. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది. హెడ్కు జరిమానా లేకపోయినా డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.