అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో మహ్మద్ షమీకి చోటు దక్కనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో మూడో టెస్టులో షమీకి విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. నాలుగో టెస్టు తుది జట్టులో షమీకి చోటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడిన మహ్మద్ షమీకి మూడో టెస్ట్ సందర్భంగా విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ తర్వాత సెకండ్ పేసర్గా ఉమేశ్ యాదవ్కు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా, నాలుగు టెస్టుల సరీస్లో ప్రస్తుతం ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. మార్చి 17 నుంచి రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి..