Yashasvi Jaiswal : యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇరానీ కప్లో పరుగుల వరద పారిస్తున్న అతను సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ టోర్నమెంట్ ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. రెస్టాఫ్ ఇండియా జట్టుకు ఆడుతున్న అతను తొలి ఇన్నింగ్స్లో 259 బంతుల్లో డబుల్ సెంచరీ (213 రన్స్) కొట్టాడు. అతనితో పాటు అభిమన్యు ఈశ్వరన్ శతకం(154)తో చెలరేగడంతో 484 రన్స్ చేసింది.
రెండో ఇన్నింగ్స్లోనూ మధ్యప్రదేశ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టిన యశస్వీ సెంచరీ (157 బంతుల్లో 144) బాదాడు. దాంతో, రెండో ఇన్నింగ్స్లో రెస్టాఫ్ ఇండియా 246కు ఆలౌట్ అయింది. 436 పరుగుల ఆధిక్యం సాధించింది. మధ్యప్రదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 294కు కుప్పకూలిన విషయం తెలిసిందే. సూపర్ ఫామ్లో ఉన్న యశస్వీ పోయిన ఏడాది నవంబర్లో బంగ్లాదేశ్ ఎ జట్టుపై కూడా 146 రన్స్తో రాణించాడు. ఈ ముంబై ఆటగాడు డిసెంబర్లో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శతకం(162)తో మెరిశాడు.
దేశవాళీలో రాణించిన యశస్వీని గత ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. జోస్ బట్లర్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతను మంచి ఆరంభాలు ఇచ్చాడు. 10 మ్యాచుల్లో 132.99 స్ట్రయిక్ రేటుతో 258 పరుగులు సాధించాడు. దాంతో, ఈ సీజన్కు కూడా రాజస్థాన్ ఈ యంగ్ ఓపెనర్ను అట్టిపెట్టుకుంది. పదిహేనో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రన్నరప్గా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయింది.