Mohammad Rizwan : పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) మరో రికార్డు తన పేర రాసుకున్నాడు. పొట్టి క్రికెట్లో మూడు వేల పరుగుల మైలు రాయికి చేరుకున్నాడు. న్యూజిలాండ్(Newzealand)తో జరిగిన రెండో టీ20లో రిజ్వాన్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో వేగంగా 3 వేల రన్స్ బాది.. విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును బ్రేక్ చేశాడు. విరాట్ 81 ఇన్నింగ్స్ల్లో 3 వేల క్లబ్లో చేరగా.. రిజ్వాన్ 79వ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
రావల్పిండిలో కివీస్తో జరిగిన రెండో టీ20లో రిజ్వాన్ రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ బాదిన ఈ చిచ్చరపిడుగు 45 పరుగులతో నాటౌట్గా నిలిచి పాక్ను అలవోకగా గెలిపించాడు. తొలుత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ 90 రన్స్కే ఆలౌటయ్యింది. పాస్ స్పీడ్స్టర్ షాహీన్ ఆఫ్రిది మూడు, అమిర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 12.1 ఓవర్లోనే ఛేదించి.. ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Pakistan go 1-0 up in the T20I series with a comprehensive win 💪#PAKvNZ 📝: https://t.co/sJ48cvtBrI pic.twitter.com/R9CADRPojM
— ICC (@ICC) April 20, 2024