ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా అవతరించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతదేశం అంతా ఆమె విజయానికి సంతోషిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా నిఖత్ జరీన్ను అభినందించారు.
గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేసిన కవిత.. ‘‘మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచిన నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్కు శుభాకాంక్షలు. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో థాయ్ల్యాండ్కు చెందిన జిట్పాండ్ జుటమాస్పై 5-0 తేడాతో గెలుపొందిన నిఖత్ జరీన్.. చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Congratulations to the daughter of Nizamabad @nikhat_zareen on winning the Women's World Boxing Championship. We all are proud of you Girl !🥊🇮🇳 pic.twitter.com/Ig6fuRDJGg
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 19, 2022