న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ రెండు నెలల ముందే జట్టును ప్రకటించింది. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ కోసం ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ బృందానికి హైదరాబాదీ స్టార్ మిథాలీరాజ్ సారథ్యం వహించనుండగా.. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న జెమీమా రోడ్రిగ్స్, శిఖా పాండేకు జట్టులో చోటు దక్కలేదు. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన ఐదేండ్ల తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చింది. మెగాటోర్నీతో పాటు కివీస్తో సిరీస్కు మేఘన స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు (ఫిబ్రవరి 11 నుంచి) న్యూజిలాండ్తో ఆడనున్న ఐదు వన్డేల సిరీస్లో కూడా ఇదే జట్టు బరిలోకి దిగనుంది. మెగాటోర్నీలో దాయాది పాకిస్థాన్తో భారత్ తొలి మ్యాచ్ (మార్చి 6) ఆడనుంది. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్ (మార్చి 10), వెస్టిండీస్ (మార్చి 12), ఇంగ్లండ్ (మార్చి 16), ఆస్ట్రేలియా (మార్చి 19), బంగ్లాదేశ్ (మార్చి 22), దక్షిణాఫ్రికా (మార్చి 27)తో తలపడనుంది.
భారత జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్, స్మృతి మందన, షఫాలీ, యష్తిక, దీప్తి, రిచ, స్నేహ్ రాణా, జులన్, పూజ, మేఘన, రేణుక, తానియా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
స్టాండ్బై ప్లేయర్స్: సబ్బినేని మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రన్ దిల్ బహదూర్.