హైదరాబాద్, ఆట ప్రతినిధి: వాలీబాల్ ఆటలో హైదరాబాద్కు ఘనమైన వారసత్వముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో నగరం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ బ్లాక్హాక్స్ జెర్సీని మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నీలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నది. క్రీడల పట్ల యువత ఆసక్తి కనబరుస్తుండటం సంతోషంగా ఉంది. భవిష్యత్లో రాష్ట్రం నుంచి మరింత మంది మెరికల్లాంటి ప్లేయర్లు వెలుగులోకి వస్తారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, బ్లాక్హాక్స్ యజమానులు అభిషేక్రెడ్డి, శ్యామ్ పాల్గొన్నారు. పీవీఎల్ రెండో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. అంతగా అనుభవజ్ఞులు లేకపోయినా హైదరాబాద్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.