MI vs PBKS | ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ ప్లేయర్స్.. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52), శిఖర్ ధవన్ (72) పరుగులతో చెలరేగారు. ఇద్దరి భాగస్వామ్యంలో పంజాబ్ 97 పరుగులు సాధించింది. మయాంక్ ఔటయిన తర్వాత మధ్యలో ముంబై బౌలర్లు కాస్త పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీశారు. దీంతో బెయిర్ స్టో (12), లివింగ్ స్టోన్ (2) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కానీ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ ( ) నిలకడగా ఆడుతూ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. షారుక్ ఖాన్ (15 ) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 198 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బాసిల్ తంపి రెండు వికెట్లు.. జయదేవ్ ఉనద్కత్, బుమ్రా, మురుగన్ ఆశ్విన్ చెరో వికెట్ తీశారు. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్.. ఈ భారీ టార్గెట్ను చేధిస్తుందో లేదో చూడాలి..