Viral Video: క్రికెట్ గురించి తెలిసినవారెవరైనా ఈ ఆట ఆడేది ఆడేవాళ్లకు కంఫర్ట్గా ఉండే పాయింట్, టీషర్ట్లు ధరించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కానీ సంప్రదాయ వస్త్రధారణ అయిన దోతి, కుర్తాలు ధరించి క్రికెట్ ఆడటాన్ని మీరెప్పుడైనా చూశారా..? ఒకవేళ మిస్ అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్కు వెళ్లి రండి. ప్రస్తుతం అక్కడ దోతి, కుర్తాలు ధరించి వేద పండితులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ టోర్నీలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ క్రికెట్ కామెంట్రీని ఇంగ్లీష్, హిందీలో కాకుండా సంస్కృతంలో చెబుతారు.
‘సేవ్ కల్చర్ ఫోరమ్’ ప్రతి యేటా భోపాల్లో నిర్వహించే ఈ టోర్నీలు జనవరి 5 నుంచి మొదలయ్యాయి. ఈ టోర్నీలో వేద పండితులు దోతి, కుర్తాలు ధరించి క్రికెట్ ఆడుతారు. భోపాల్లోని అంకుర్ గ్రౌండ్లో ఈ టోర్నీ జరుగుతోంది. సుమారు 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందు వేద మంత్రాలు పఠించి దీనిని మొదలుపెట్టడం గమనార్హం. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు అయోధ్యలో సత్కారం దక్కనుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది.
Madhya Pradesh: In a unique cricket tournament organized by Sanskriti Bachao Manch in Bhopal, the players can be seen playing in ‘dhoti’ and ‘kurta’ while commentary is being done in the Sanskrit language.#IndianCricket @BCCIdomestic @mufaddal_vohra pic.twitter.com/1ljuOxRgjs
— Amit Singh Paliwall (@siramitsingh) January 6, 2024