WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) రఫ్ఫాడించింది. యూపీ వారియర్స్తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ రాణించడంతో భారీ స్కోర్ చేసింది. రీచా ఘోష్(62), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(53)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు, దాంతో, నిర్ణీత ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు బాదింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు తీసింది.
Innings Break!
Fifties from Sabbhineni Meghana & Richa Ghosh guide #RCB to 157/6 😎
Will it be enough for @UPWarriorz? Find out 🔜
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/2x85howr6r
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. గ్రేస్ హ్యారిస్ ఓవర్లో ఓపెనర్ సోఫె డెవిన్() ఎల్బీగా ఔటయ్యింది. కెప్టెన్ స్మృతి మంధాన(13) ఫుల్ షాట్ ఆడబోయి వ్రిందా దినేశ్ చేతికి చిక్కింది. దాంతో, బెంగళూరు జట్టు 36 పరుగులకే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఎలీసా పెర్రీ(8)తో కలిసిన సబ్బినేని మేఘన (53) బౌండరీలతో విజృంభించింది.
Two in an over for Rajeshwari Gayakwad ⚡️⚡️#RCB 141/5 with two overs to go!
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/gCdDUQsesR
— Women’s Premier League (WPL) (@wplt20) February 24, 2024
రీచా ఘోష్(62) వచ్చాక ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరూ పోటీపోటీగా బౌండరీలు కొట్టడంతో 15 ఓవర్లకే ఆ జట్టు స్కోర్ 115 దాటింది. అయితే.. రాజేశ్వరీ ఒకే ఓవర్లో మేఘన. వరేహ్లను ఔట్ చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడిన రీచా ఫిఫ్టీ సాధించింది. చివర్లో మొలినెక్స్(9 నాటౌట్), శ్రేయాంక పాటిల్(8 నాటౌట్) దంచడంతో మంధాన సేన యూపీ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగింది.