ముంబై: లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్కు భారీ జరిమానా పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్కు పాల్పడడంతో ఐపీఎల్ నిర్వాహకులు రూ.24 లక్షలు జరిమానా విధించారు. గతంలో తప్పిదానికి రూ.12 లక్షలు విధించగా.. రెండో తప్పిదానికి రెట్టింపు స్థాయిలో ఫైన్ వేశారు.
‘కేఎల్ రాహుల్కు రూ.24 లక్షలు, మిగిలిన జట్టు సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించాం. ఈ సీజన్లో జట్టుకు ఇది రెండో తప్పిదం’ అని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఈ మ్యాచ్లో ముంబైపై 36 పరుగుల తేడాతో లక్నో గెలిచిన విషయం తెలిసిందే.