INDvsSA 1st ODI: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జోహన్నస్బర్గ్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ రూపంలో భారత్కు భవిష్యత్ స్టార్ దొరికాడని, టీమిండియాకు అతడే ‘నెక్స్ట్ బిగ్ థింగ్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. నమ్మకం కుదరకుంటే తన వ్యాఖ్యలను రాసిపెట్టుకోమని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ స్పందిస్తూ… ‘నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా. రాసిపెట్టుకోండి. ఈ కుర్రాడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. 2021లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో అరంగేట్రం చేసినప్పట్నుంచీ ఇప్పటివరకూ అతడు వెనుదిరిగి చూసుకోలేదు. టీఎన్పీఎల్, రంజీలు, ఐపీఎల్, కౌంటీ క్రికెట్.. ఇలా ఎక్కడికెళ్లినా సక్సెస్ అయ్యాడు. తాజాగా వన్డే అరంగేట్ర మ్యాచ్లోనే తానెంటో నిరూపించుకున్నాడు..’ అని ట్వీట్ చేశాడు. అశ్విన్తో పాటు సాయి కూడా తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం.
Like Mozhi MS Bhaskar ( movie reference ), I have been repeatedly telling this about Sai Sudharsan.
‘Mark my words, this boy will go places’
Ever since his 2021 TNPL debut, he hasn’t looked back.
TNPL ✅
Ranji ✅
IPL ✅
County ✅
Ind A ✅ODI DEBUT now ✅
Keep chasing…
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 17, 2023
తొలి వన్డేలో సాయి.. 43 బంతుల్లోనే 9 బౌండరీల సాయంతో 55 పరగులు చేసి నాటౌట్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అతడు మ్యాచ్ను కూడా ముగించడం విశేషం. ఈ మ్యాచ్లో అర్థ సెంచరీ చేయడం ద్వారా అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్గా రికార్డులకెక్కాడు.