న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో వచ్చే నెలలో జరుగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్ల్లో భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో యూరప్ టూర్కు దూరమైన మన్ప్రీత్ తిరిగి జట్టులో చేరడంతో భారత్ బలం పెరిగింది. ఏప్రిల్ 11, 12న జరిగే రెండు మ్యాచ్ల కోసం 22 మందితో కూడిన జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. 16 రోజుల పర్యటన కోసం భారత జట్టు బుధవారం బయలుదేరనుంది.