WPL 2024 : భారతీయ వంటకాల రుచికి ఫిదా అవ్వని విదేశీయులు ఉండరు. ఇక్కడి బిర్యానీ, చాయ్.. ఏదైనా సరే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఇక క్రికెటర్లు అయితే ఇండియన్ ఫుడ్(Indian Food)ను మరీ ఇష్టంగా తింటారు. భారతీయ టీ రుచికి ఫిదా అయిన వాళ్ల జాబితాలో రాయల్ చాలెంజర్స్ ఆల్రౌండర్ ఎలీసే పెర్రీ(Ellyse Perry) కూడా చేరింది. చిన్నస్వామి స్టేడియంలో ‘గ్లాస్ బ్రేకింగ్’ ఇన్నింగ్స్ ఆడిన పెర్రీకి ఇష్టమైన భారతీయ పానీయం ఎంటో తెలుసా..? మసాలా చాయ్(Masala Chai).
అవును.. ఈ స్టార్ ఆల్రౌండర్ మసాలా టీపై మనసు పడింది. ఈ విషయాన్ని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వెల్లడించింది. యూపీ వారియర్స్పై 23 పరుగుల విజయంలో అనంతరం మంధాన, పెర్రీతో ముచ్చటించింది. ఆ సందర్భంగా పెర్రీ.. మసాలా చాయ్ తాగడానికి మంచి టైమ్ ఏది? అని మంధానను అడిగింది.
The obsession with Masala Chai ☕️
Enjoying batting in tandem 🤝
That window-smashing SIX 💥Signing off from Chinnaswamy with Captain Smriti Mandhana & Ellyse Perry 👌👌 – By @RajalArora
Full Interview 🎥🔽 #TATAWPL | #UPWvRCBhttps://t.co/flj9RvzB2J pic.twitter.com/3dvGZ43E35
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2024
‘మీ సమయంలో కాదు. నువ్వు 12 కప్పుల మసాలా చాయ్ తాగుతున్నావనుకుంటా. భారతీయుల విషయానికొస్తే ఉదయం 9ః30 గంటలకు ఓసారి, సాయంత్రం 4 గంటలకు ఓసారి మసాలా టీ తాగుతారు. రోజుకు రెండు కప్పులు సరిపోతుంది. కానీ, నువ్వేమో 12 కప్పులు స్వాహా చేస్తున్నావ్. ఇకపై అన్ని కప్పుల మసాలా టీ తాగకు ప్లీజ్’ అని మంధాన బదులిచ్చింది. దాంతో, పెర్రీ సైతం ఓకే అన్నట్టు నవ్వేసింది.
The Art and the Artist 🤭 #PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #UPWvRCB @EllysePerry pic.twitter.com/pKlHBzTO29
— Royal Challengers Bangalore (@RCBTweets) March 4, 2024
సోమవారం యూపీపై పెర్రీ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె కొట్టిన ఓ సిక్సర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’కు ఇచ్చే కారు అద్దాన్ని బద్ధలు కొట్టింది. యూపీపై అద్భుత విజయం తర్వాత మంధాన, పెర్రీలు బయటకు వెళ్లి మసాలా చాయ్ తాగొచ్చారు. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ టీ తాగుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
రెండో సీజన్ను విజయంతో ఆరంభించిన బెంగళూరు వరుసగా రెండు ఓటములు చవిచూసింది. ఆ జట్టు ఆట చూసినవాళ్లకు తొలి సీజన్ ప్రదర్శన గుర్తుకొచ్చింది. అయితే.. సొంత మైదానంలో యూపీతో జరిగిన చివరి మ్యాచ్లో ఆర్సీబీ టాపార్డర్ కదం తొక్కింది. కెప్టెన్ మంధాన(80 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), పెర్రీ(58 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. వీళ్ల ఊచకోతకు యూపీ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Up, up and away she goes! Hopefully, many more from the skip, tonight! ☄️#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #UPWvRCB @SMrir
— Royal Challengers Bangalore (@RCBTweets) March 4, 2024
మంధాన ఔటయ్యాక.. పెర్రీ ఎడాపెడా బౌండరీలు బాది జట్టుకు భారీ స్కోర్ అందించింది. అనంతరం బౌలర్లు రాణించడంతో యూపీ జట్టు 175 పరుగులకే ఆలౌటయ్యింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్సీబీ జట్టు మూడో విజయం నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.