Electricity Scam : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కనెక్షన్ను తక్షణమే తొలగిస్తామని 77 ఏండ్ల డాక్టర్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫిబ్రవరి 23న బెదిరింపు కాల్ రావడంతో బాధితుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి.
తమను కాంటాక్ట్ చేయాలని స్కామర్లు ఒత్తిడి తెచ్చినా వారి సూచించిన నెంబర్కు కాల్ చేసేందుకు డాక్టర్ నిరాకరించారు. స్కామర్ల బలవంతంతో అప్గ్రేడ్ పేరుతో స్కామర్లకు డాక్టర్ రూ. 10 చెల్లించారు. ఆపై నిందితులు పంపిన లింక్లో వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా బాధితుఉ తనకు తెలియకుండానే డెబిట్ కార్డు వివరాలు వెల్లడించారు.
ఆపై తన బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా పలు లావాదేవీలు జరిగాయని గుర్తించారు. ఎలాంటి ఓటీపీ వెరిఫికేషన్ లేకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై బాధిత డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Health Tips | ఆ గోళీలు మితిమీరినా ప్రమాదమే