కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుకు శుభారంభం లభించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన డుప్లెసిస్ (0) తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడిన కోహ్లీ, పటీదార్ ఇద్దరూ సాధ్యమైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు.
పవర్ప్లే చివరి రెండు ఓవర్లలో యువ ఆటగాడు పటీదార్ చెలరేగిపోయాడు. ఐదు బౌండరీలు, ఒక సిక్సర్తో అదరగొట్టాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 52 పరుగులతో నిలిచింది.