గుజరాత్తో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు చిత్తయింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు.. ఓపెనర్ గిల్ అర్ధశతకంతో రాణించడంతో 144 పరగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నోకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. డీకాక్ (11), రాహుల్ (6) ఇద్దరూ స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (27) కాసేపు పోరాడాడు. కానీ అవతలి ఎండ్ నుంచి హుడాకు సహకారం కరువైంది. కొత్త కుర్రాడు కరణ్ శర్మ (4), కృనాల్ పాండ్యా (5), ఆయుష్ బదోనీ (8), మార్కస్ స్టొయినిస్ (2), జేసన్ హోల్డర్ (1), మొహ్సిన్ ఖాన్ (1) అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే మైదానం వీడారు.
చివర్లో ఆవేష్ ఖాన్ (12) రెండు సిక్సర్లు బాదినా.. ఆ తర్వాత సాహా అద్భుతమైన నిర్ణయంతో రివ్యూ తీసుకోవడంతో అవుటై పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో జట్టు 82 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలింగ్లో రషీద్ ఖాన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. కొత్త కుర్రాడు సాయి కిషోర్, యష్ దయాళ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
షమీ ఖాతాలో కీలకమైన రాహుల్ వికెట్ చేరింది. బౌలర్లందరూ రాణించడంతో గుజరాత్ జట్టు 62 పరుగుల తేడాతో లక్నోపై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ అధికారికంగ ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది.
That's that from Match 57.@gujarat_titans win by 62 runs and become the first team to qualify for #TATAIPL 2022 Playoffs.
Scorecard – https://t.co/45Tbqyj6pV #LSGvGT #TATAIPL pic.twitter.com/PgsuxfLKye
— IndianPremierLeague (@IPL) May 10, 2022