న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్లిఫ్టర్ మీరాబాయ్ చానుకు ఇవాళ పార్లమెంట్ కంగ్రాట్స్ చెప్పింది. లోక్సభ, రాజ్యసభలో మీరా సాధించిన ఘనతను గుర్తు చేశారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. మీరా ఒలింపిక్స్ మెడల్ గెలిచి దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు. వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లో 21 ఏళ్ల తర్వాత ఇండియా ఒలింపిక్ మెడల్ సాధించిన రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య తెలిపారు. ఇక టోక్యోలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న చాను.. తన కోచ్ విజయ్ శర్మతో కలిసి ఇండియాకు తిరుగు ప్రయాణమైంది.
ఇవాళ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ఉభయసభల్లోనూ ఎంపీలు నివాళి అర్పించారు. పెగాసిస్ ప్రాజెక్టు నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో.. రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక లోక్సభలోనూ ఎంపీలు వెల్లోకి దూసుకువచ్చి ఇదే అంశంపై చర్చ చేపట్టాలని పట్టుపట్టారు. దీంతో సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.