హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ ఇండియన్ ఓపెన్ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ లోకేశ్వరి పతక జోరు కనబరిచింది. మహిళల ఎస్37 షాట్పుట్ విభాగంలో రజతం, డిస్కస్త్రోలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. జాతీయస్థాయిలో రాణించిన లోకేశ్వరిని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్లో అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్ర ప్లేయర్లు అద్భుత ప్రతిభ చాటారు. పతకాల సాధనలో రెండో స్థానంలో నిలిచి సత్తాచాటారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగిస్తున్నాం. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించి రాష్ర్టానికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, కోచ్ వేణు, పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ పాల్గొన్నారు.